నవంబర్ 27 నుంచి మదీనాకు ఎతిహాద్ విమాన సర్వీసులు
- November 01, 2021
అబుధాబి: కరోనా ఎఫెక్ట్ కారణంగా సౌదీ లోని మదీనా కు విమాన సర్వీసులు నిలిపివేసిన ఎతిహాద్ ఎయిర్ వేస్ మళ్లీ సేవలను స్టార్ట్ చేయనుంది. నవంబర్ 27 నుంచి అబుదాబి నుంచి మదీనా కు విమానాలను నడిపిస్తామని సంస్థ ప్రకటించింది. ఎయిర్ బస్ 321 ద్వారా వారానికి మూడు సార్లు అబుదాబి నుంచి మదీనా కు ఫ్లైట్ సర్వీసులు ఉంటాయని తెలిపింది. సౌదీలోని పవిత్ర మక్కా, మదీనా లకు ఎప్పటి మాదిరిగానే పర్యాటకులను అనుమతిస్తామని సౌదీ ప్రభుత్వం గత నెలలోనే ప్రకటించింది. ఈ నేఫథ్యంలోనే మదీనాకు ఎతిహాద్ విమాన సర్వీసులను పునరుద్దరిస్తోంది. ఐతే ప్రయాణికులు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధన పెట్టింది. సౌదీ ప్రభుత్వం కూడా మదీనా కు వచ్చే వారు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్న వారై ఉండాలని తెలిపింది. వ్యాక్సినేషన్ పూర్తైన వారికి ఎలాంటి క్వారంటైన్ నిబంధనలను సౌదీ విధించలేదు. దీంతో రెండు డోసుల వ్యాక్సిినేషన్ పూర్తైన వారు మదీనా కు వెళ్లవచ్చు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









