బహ్రెయిన్లో ఇద్దరు మహిళా వలసదారుల ఆత్మహత్య
- March 20, 2016
ఆసియాకి చెందిన ఇద్దరు మహిళా వలసదారులు బహ్రెయిన్లో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. నేపాల్కి చెందిన ఇద్దరు మహిళలు తమ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. సల్మానియా మరియు ఆలి ప్రాంతాల్లో ఈ ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సల్మానియా ఘటన చోటు చేసుకుంది. నితా నేపాలి అనే మహిళ క్లీనింగ్ స్టాఫ్గా మనామాలోని వైబ్రెంట్ సర్వీసెస్లో పనిచేస్తోంది. మరో ఆరుగురు నేపాలీలతో కలిసి ఓ ఫ్లాట్లో ఈమె నివసిస్తోంది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో నితా మృతదేహం భద్రపరచబడింది. కేసు విచారణలో ఉందనీ, ప్రాసెస్ పూర్తయ్యాక నితా మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఆలిలో ఆత్మహత్య చేసుకున్న మహిళకు సంబంధించిన వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







