బహ్రెయిన్లో ఇద్దరు మహిళా వలసదారుల ఆత్మహత్య
- March 20, 2016
ఆసియాకి చెందిన ఇద్దరు మహిళా వలసదారులు బహ్రెయిన్లో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగు చూశాయి. నేపాల్కి చెందిన ఇద్దరు మహిళలు తమ రూమ్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. సల్మానియా మరియు ఆలి ప్రాంతాల్లో ఈ ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సల్మానియా ఘటన చోటు చేసుకుంది. నితా నేపాలి అనే మహిళ క్లీనింగ్ స్టాఫ్గా మనామాలోని వైబ్రెంట్ సర్వీసెస్లో పనిచేస్తోంది. మరో ఆరుగురు నేపాలీలతో కలిసి ఓ ఫ్లాట్లో ఈమె నివసిస్తోంది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో నితా మృతదేహం భద్రపరచబడింది. కేసు విచారణలో ఉందనీ, ప్రాసెస్ పూర్తయ్యాక నితా మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఆలిలో ఆత్మహత్య చేసుకున్న మహిళకు సంబంధించిన వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్







