ఇరాక్ ప్రధానిపై హత్యాయత్నం..
- November 07, 2021
బాగ్దాద్: ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్ కధిమిపై హత్యాయత్నం జరిగింది. దాడి విఫలమవడంతో క్షేమంగా బయటపడ్డారు ప్రధాని. దాడిలో ఐదుగురు గాయపడ్డారు. దీంతో వీరిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అత్యంత భద్రత నడుమ ఉండే ప్రధాని ముస్తఫా నివాసంపై తెల్లవారుజామున డ్రోన్ దాడి చేశారు దుండగులు. డ్రోన్ దాడితో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని ముస్తఫాను సురక్షిత ప్రాంతానికి తరలించింది. అత్యంత భద్రత నడుమ గ్రీన్ జోన్లో ఉండే ప్రధాని ఇంటిపై డ్రోన్ దాడి జరగడంపై ఇరాక్ ఆర్మీ అలర్టయింది. దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ ప్రకటన చేయలేదు. తాను క్షేమంగా ఉన్నాట్లు చెప్పారు ఇరాక్ ప్రధాని ముస్తఫా. దేశ ప్రజలంతా శాంతియుతంగా, సంయమనంతో ఉండాలన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









