మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- March 13, 2026
రియాద్: మక్కా మరియు మదీనాలోని భవన యజమానులు లైసెన్స్ లేకుండా ఏదైనా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలు చేపట్టవద్దని పర్యాటక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యాత్రికులకు తాత్కాలిక వసతి సౌకర్యాలుగా మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన భవనాలకు మాత్రమే హజ్ సీజన్లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
రాబోయే హజ్ సీజన్కు సన్నాహకంగా అందించే ఆతిథ్య సేవల నాణ్యతను పెంచడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మక్కా మరియు మదీనాలోని భవన యజమానులకు తాత్కాలిక వసతి సౌకర్యాల లైసెన్స్లను జారీ చేయడం ద్వారా యాత్రికుల వసతి రంగాన్ని నిర్వహించడానికి కృషి చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
మంత్రిత్వ శాఖ ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా హజ్ సీజన్లో పర్యాటక ఆతిథ్య సౌకర్యాలు తమ వసతి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించే సర్వీసును కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే, ఈ సేవలు హజ్ సీజన్కు మాత్రమే పరిమితమని స్ఫష్టం చేసింది.
లైసెన్స్ లేకుండా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలను నిర్వహిస్తే SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!









