మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- March 13, 2026
రియాద్: మక్కా మరియు మదీనాలోని భవన యజమానులు లైసెన్స్ లేకుండా ఏదైనా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలు చేపట్టవద్దని పర్యాటక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యాత్రికులకు తాత్కాలిక వసతి సౌకర్యాలుగా మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన భవనాలకు మాత్రమే హజ్ సీజన్లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
రాబోయే హజ్ సీజన్కు సన్నాహకంగా అందించే ఆతిథ్య సేవల నాణ్యతను పెంచడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మక్కా మరియు మదీనాలోని భవన యజమానులకు తాత్కాలిక వసతి సౌకర్యాల లైసెన్స్లను జారీ చేయడం ద్వారా యాత్రికుల వసతి రంగాన్ని నిర్వహించడానికి కృషి చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
మంత్రిత్వ శాఖ ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా హజ్ సీజన్లో పర్యాటక ఆతిథ్య సౌకర్యాలు తమ వసతి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించే సర్వీసును కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే, ఈ సేవలు హజ్ సీజన్కు మాత్రమే పరిమితమని స్ఫష్టం చేసింది.
లైసెన్స్ లేకుండా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలను నిర్వహిస్తే SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!







