మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- March 13, 2026
రియాద్: మక్కా మరియు మదీనాలోని భవన యజమానులు లైసెన్స్ లేకుండా ఏదైనా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలు చేపట్టవద్దని పర్యాటక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. యాత్రికులకు తాత్కాలిక వసతి సౌకర్యాలుగా మంత్రిత్వ శాఖ లైసెన్స్ పొందిన భవనాలకు మాత్రమే హజ్ సీజన్లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
రాబోయే హజ్ సీజన్కు సన్నాహకంగా అందించే ఆతిథ్య సేవల నాణ్యతను పెంచడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మక్కా మరియు మదీనాలోని భవన యజమానులకు తాత్కాలిక వసతి సౌకర్యాల లైసెన్స్లను జారీ చేయడం ద్వారా యాత్రికుల వసతి రంగాన్ని నిర్వహించడానికి కృషి చేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
మంత్రిత్వ శాఖ ఆమోదించిన నిబంధనలకు అనుగుణంగా హజ్ సీజన్లో పర్యాటక ఆతిథ్య సౌకర్యాలు తమ వసతి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలు కల్పించే సర్వీసును కూడా ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే, ఈ సేవలు హజ్ సీజన్కు మాత్రమే పరిమితమని స్ఫష్టం చేసింది.
లైసెన్స్ లేకుండా పర్యాటక ఆతిథ్య కార్యకలాపాలను నిర్వహిస్తే SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రాపర్టీ ఇన్వెస్టర్లకు రెండు సంవత్సరాల రెసిడెన్సీ వీసా నిబంధనల్లో మార్పులు
- మేలో బ్యాంక్ హాలిడేస్ ఫుల్ లిస్ట్..!
- దక్షిణ సూడాన్ రాజధాని శివార్లలో విమానం కూలి 14 మంది మృతి
- ఎగ్జిట్ పోల్స్ కౌంట్డౌన్ షురూ.. మే 4న తుది ఫలితాలు
- పర్యాటకానికి కొత్త కళ..హైదరాబాద్లో భారీ కార్నివాల్ నిర్వహణ
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!









