ఎమిరేట్స్ రోడ్డు లో యాక్సిడెంట్. మూడు ఒంటెల మృతి
- November 08, 2021
యూఏఈ : కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మూడు ఒంటెలు చనిపోయిన ఘటన ఎమిరేట్స్ రోడ్ లో జరిగింది. మరో మూడు ఒంటెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఒంటెలు రోడ్డు దాటుతుండగా అరబ్ డ్రైవర్ ఒకరు కారుతో వేగంగా వాటిని ఢీకొట్టాడు. దీంతో స్పాట్ లోనే మూడు ఒంటెలు చనిపోయాయి. కారు డ్రైవర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. యాక్సిడెంట్ స్పాట్ కి పోలీసులు చేరుకునే లోపే అతను పరారయ్యాడు. డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా వాహనాదారులు అన్ని సేప్టీ మెజర్స్ పాటించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు. పొగమంచు దట్టంగా ఉందని...ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తుండగా మొబైల్ లో మాట్లాడటం చేయొద్దని, సీటు బెల్ట్ లేకుండా వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం









