మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారు...ఈ ఫుడ్కు దూరంగా ఉండాల్సిందే..
- November 09, 2021
మనలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. ఇది సాధారణ తలనొప్పిగా మొదలై తలకు ఒకవైపు విపరీతమైన నొప్పిగా మారుతుంటుంది. మైగ్రేన్ వచ్చిన వారు ఆ తలనొప్పిని భరించలేరు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. వాతావరణం చల్లగా మారితే చాలు వెంటనే తలపోటు మొదలువుతంది. అయితే మైగ్రేన్తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆ నొప్పి మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ మైగ్రేన్తో బాధపడే వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..
- ప్రస్తుతం వంటకాల్లో టేస్టింగ్ సాల్ట్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ టెస్టింగ్ సాల్ట్లో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మైగ్రేన్ నొప్పి పెరగడానికి కారణంగా మారుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ను ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్లో వాడుతుంటారు. కాబట్టి మైగ్రేన్తో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో దీనికి దూరంగా ఉండాలి.
- మైగ్రేన్తో బాధపడేవారు షుగర్ ఫ్రీ పేరిట లభించే పిల్స్కు దూరంగా ఉండాలి. ఇవి కూడా మైగ్రేన్ నొప్పి పెరగడానికి కారణంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
- చాక్లెట్లు తింటే కూడా మైగ్రేన్ సమస్య పెరుగుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారు చాక్లెట్ తింటే మైగ్రేన్ తలనొప్పి ఎక్కువయ్యే అవకాశాలు 22 శాతం పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.
- మైగ్రేన్ సమస్య ఉన్న వారు నిల్వ చేసిన మాంసం తింటే నొప్పి పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మాంసహారాన్ని నిల్వ చేసి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
- చీజ్ తిన్నా మైగ్రేన్ నొప్పి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చీజ్ తింటే మైగ్రేన్ నొప్పి పెరిగే అవకాశం 35 శాతం వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
- కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. సాధారణంగా టీ తాగితే తలనొప్పి తగ్గుతుందని అనుకుంటాం.. కానీ మైగ్రేన్తో బాధపడేవారికి మాత్రం నొప్పి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!









