2026 నాటికి గ్లోబల్ టూరిస్ట్ హబ్ గా బహ్రెయిన్
- November 09, 2021
బహ్రెయిన్:ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం టూరిజం పై దృష్టి పెట్టింది. 2026 నాటికి బహ్రెయిన్ ను గ్లోబల్ టూరిజం హబ్ గా మార్చే విధంగా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. మరో ఐదేళ్లలో 14.1 మిలియన్ల టూరిస్ట్ లను అట్రాక్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ప్రస్తుతం బహ్రెయన్ లో టూరిస్టుల సగటు ఖర్చు 74.8 దినార్ లు గా ఉంది. దీన్ని మరింత పెంచాలని..అదే విధంగా విదేశాల నుంచి వచ్చే టూరిస్టులు ఇప్పుడున్న సగటును 3.5 రోజుల కన్నా ఎక్కువ రోజులు దేశంలో గడిపే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దేశ జీడీపీ లో టూరిజం కంట్రిబ్యూషన్ ను 2026 నాటికి 11.4 పర్సెంటేజ్ కు పెంచాలని ప్రభుత్వం గట్టిగా డిసెడైంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాల్లో బహ్రెయిన్ టూరిజం కోసం ప్రమోషన్స్ చేపట్టనుంది. బహ్రెయిన్ ను ఎక్కువ విజిట్ చేయని దేశాల్లో ప్రమోషన్ చేస్తూ వారిని అట్రాక్ట్ చేయాలని నిర్ణయించింది. టూరిజం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









