మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న వారు...ఈ ఫుడ్కు దూరంగా ఉండాల్సిందే..
- November 09, 2021మనలో చాలా మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతుంటారు. ఇది సాధారణ తలనొప్పిగా మొదలై తలకు ఒకవైపు విపరీతమైన నొప్పిగా మారుతుంటుంది. మైగ్రేన్ వచ్చిన వారు ఆ తలనొప్పిని భరించలేరు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువ అవుతుంది. వాతావరణం చల్లగా మారితే చాలు వెంటనే తలపోటు మొదలువుతంది. అయితే మైగ్రేన్తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆ నొప్పి మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ మైగ్రేన్తో బాధపడే వారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..
- ప్రస్తుతం వంటకాల్లో టేస్టింగ్ సాల్ట్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఈ టెస్టింగ్ సాల్ట్లో మోనోసోడియం గ్లూటమేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది మైగ్రేన్ నొప్పి పెరగడానికి కారణంగా మారుతుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ను ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్లో వాడుతుంటారు. కాబట్టి మైగ్రేన్తో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లో దీనికి దూరంగా ఉండాలి.
- మైగ్రేన్తో బాధపడేవారు షుగర్ ఫ్రీ పేరిట లభించే పిల్స్కు దూరంగా ఉండాలి. ఇవి కూడా మైగ్రేన్ నొప్పి పెరగడానికి కారణంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
- చాక్లెట్లు తింటే కూడా మైగ్రేన్ సమస్య పెరుగుందని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారు చాక్లెట్ తింటే మైగ్రేన్ తలనొప్పి ఎక్కువయ్యే అవకాశాలు 22 శాతం పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది.
- మైగ్రేన్ సమస్య ఉన్న వారు నిల్వ చేసిన మాంసం తింటే నొప్పి పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మాంసహారాన్ని నిల్వ చేసి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.
- చీజ్ తిన్నా మైగ్రేన్ నొప్పి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చీజ్ తింటే మైగ్రేన్ నొప్పి పెరిగే అవకాశం 35 శాతం వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
- కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. సాధారణంగా టీ తాగితే తలనొప్పి తగ్గుతుందని అనుకుంటాం.. కానీ మైగ్రేన్తో బాధపడేవారికి మాత్రం నొప్పి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం