ఏపీ తీర ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌..

- November 11, 2021 , by Maagulf
ఏపీ తీర ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌..

అమరావతి: బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ముంచె త్తుతుంది. నేడు తుఫాన్‌ తీరం దాటనున్న నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లోని జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలె వరూ ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక తుఫాన్‌ కొద్ది సేపట్లో తమిళ నాడులోని కరైకల్‌, ఏపీలోని శ్రీహరి కోట వద్ద ఉన్న కడలూరులో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికే ఈ వాయుగుండం వల్ల తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ జన జీవనం అస్తవ్యస్తం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతాల్లో కూడా గంటకు 50-60 కీలోమీటర్ల నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తమిళ నాడు, ఏపీలోని తిరుపతిలో భారీ వర్షం పడుతోంది. ఈ వర్షాల తో తమిళనాడులో 14 మంది మృతి చెందారు. ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాలతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com