అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 20 మంది అరెస్ట్
- November 12, 2021
మస్కట్: ఒమన్ లోకి సుల్తానేట్ ప్రాంతం నుంచి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 20 మందిని కోస్ట్ గార్డ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారంటూ వారిపై కేసులు నమోదు చేశారు. నార్త్ అల్ బాటియా గవర్నరేట్ కోస్టల్ గార్డ్ పోలీసులకు 20 మంది దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పక్కా సమాచారం అందింది. దీంతో తీర ప్రాంతంలో నిఘా వేసి బోటులో వస్తున్న 20 మందిని అరెస్ట్ చేశారు. "అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు 20 మంది బోటులో వచ్చారు. వారి ప్రయత్నాన్ని నార్త్ అల్ బాటియా గవర్నరేట్ కోస్టల్ గార్డ్ పోలీసులు అడ్డుకున్నారు. 20 మంది అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశాం" అని రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







