అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 20 మంది అరెస్ట్
- November 12, 2021
మస్కట్: ఒమన్ లోకి సుల్తానేట్ ప్రాంతం నుంచి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 20 మందిని కోస్ట్ గార్డ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారంటూ వారిపై కేసులు నమోదు చేశారు. నార్త్ అల్ బాటియా గవర్నరేట్ కోస్టల్ గార్డ్ పోలీసులకు 20 మంది దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పక్కా సమాచారం అందింది. దీంతో తీర ప్రాంతంలో నిఘా వేసి బోటులో వస్తున్న 20 మందిని అరెస్ట్ చేశారు. "అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు 20 మంది బోటులో వచ్చారు. వారి ప్రయత్నాన్ని నార్త్ అల్ బాటియా గవర్నరేట్ కోస్టల్ గార్డ్ పోలీసులు అడ్డుకున్నారు. 20 మంది అరెస్ట్ చేసి వారిపై కేసులు నమోదు చేశాం" అని రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్









