దుబాయ్ ఎయిర్ షో: 16 ఏళ్ల తర్వాత పాల్గొంటున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్
- November 13, 2021
యూఏఈ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సారంగ్, తేజస్, సూర్యకిరణ్ రోబాటిక్స్ బృందాలు దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొంటున్నాయి. దుబాయ్ ఎయిర్ షోలో తొలిసారిగా సూర్యకిరణ్, తేజస్ తమ వైమానిక విన్యాసాలను ప్రదర్శించనున్నాయి. ఈ బృందాలు నిన్న యుఎఇకి చేరుకున్నాయని, ఎయిర్ షో కోసం సిద్ధమవుతున్నాయని భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. "ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)ని UAE ప్రభుత్వం దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొనడానికి ఆహ్వానించింది. సౌదీ హాక్స్, రష్యన్ నైట్స్, UAE యొక్క అల్ వంటి ప్రపంచంలోని అత్యుత్తమ ఏరోబాటిక్స్, డిస్ప్లే టీమ్లతో కలిసి ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించబడింది. " బ్యూరో తెలిపింది. ఎయిర్ షోలో ఇండియాకు చెందిన సారంగ్, సూర్యకిరణ్, తేజస్ ఏరోబాటిక్స్ బృందాలు తమ విన్యాసాలతో అలరించనున్నాయి. సారంగ్ అంటే హిందీలో మల్టీ కలర్స్ అని అర్ధం. సూర్యకిరణ్ అంటే సూర్యకాంతి కిరణాలు, తేజస్ అంటే హిందీలో గంభీరమైన లేదా శక్తివంతమైనది. 2005లో అల్ ఐన్ గ్రాండ్ ప్రిక్స్లో చివరగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాల్గొంది. మళ్లీ 16 సంవత్సరాల తర్వాత ఇండియాకు చెందిన ప్రముఖ ఏరోబాటిక్స్ బృందాలు వచ్చే వారం జరుగనున్న దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొనేందుకు యూఏఈకి వచ్చాయి.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









