దుబాయ్ ఎక్స్ పో 2020: భారత్-జిసిసి సదస్సులో పాల్గొన్న ఖతార్
- November 13, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020లో భారత పెవిలియన్లో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఇండియా-జిసిసి (గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్) బిజినెస్ కాన్ఫరెన్స్లో ఖతార్ పాల్గొంది. కమీషనర్-జనరల్, దుబాయ్ ఎక్స్ పో 2020 ఖతార్ ప్రిపరేషన్ కమిటీ ఛైర్మన్ నజీర్ బిన్ మహమ్మద్ అల్-ముహన్నదీ, ఎక్స్ పో 2020లో ఖతార్ పెవిలియన్ ప్రిపరేషన్ కమిటీ అసిస్టెంట్ ఛైర్మన్ అబ్దుల్బాసిత్ అల్-అజ్జీ, అబ్బీచాన్ లు ఖతార్ ప్రతినిధి బృందంలో ఉన్నారు. దోహా భాగస్వామ్యం రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక సంబంధాలను పెంపొందించడానికి, అలాగే ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను మరింత బలోపేతం అయ్యేందుకు దోహదపడుతుందని ఖతార్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. దుబాయ్ ఎక్స్ పో 2020లో ఖతార్ ప్రత్యేక పెవిలియన్ ఏర్పాటు చేసింది. ఖతార్ నేషనల్ విజన్ 2030ని ప్రతిబింబించే ప్రోగ్రామ్స్ ను హైలైట్ చేసే అనేక కార్యకలాపాలు, ఈవెంట్లను నిర్వహిస్తుంది. 2022 FIFA ప్రపంచ కప్కు ఆతిథ్యానికి ఇప్పటికే పూర్తైన ప్రాజెక్టలను సందర్శకులకు తెలిసేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసింది. అలాగే ఖతార్ లో పెట్టుబడి దారులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర అంశాలను ఖతార్ హైలెట్ చేస్తోంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







