ఎకో డ్రైవ్: రెండు ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభించిన దుబాయ్
- November 13, 2021
దుబాయ్: కటింగ్ ఎడ్జ్ ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి ట్రయల్ ప్రారంభమయ్యింది. రెండు వోల్వో 7900 వాహనాల్ని ఎంపిక చేసిన మార్గాల్లో లా మెర్ సౌత్, కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మరియు అల్ సుఫౌ ట్రామ్ స్టేషన్ల మధ్య వీటిని నడుపుతారు. రోడ్స్ మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ, వోల్వో బస్ కంపెనీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ, మెరాస్ రియల్ ఎస్టేట్ మరియు ఎబిబి గ్రూప్ సంయుక్తంగా ఈ ఎకో ఫ్రెండ్లీ మార్గాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎబిబి గ్రూపు సరఫరా చేసే స్టాండింగ్ ఎలక్ట్రిక్ చార్జర్ వీటికి వినియోగిస్తున్నారు. నైట్ ఎలక్ట్రిక్ ఛార్జర్ అల్ కోజ్ బస్ డిపో వద్ద ఏర్పాటు చేశారు. స్టాండింగ్ ఆర్మ్ ద్వారా లా మెర్ వద్ద పార్కింగ్ స్లాట్లో ఛార్జింగ్ చేసేలా అలాగే వైర్ ద్వారా కూడా ఛార్జింగ్ చేసేలా అవకాశం దొరుకుతుంది. 2050 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యంగా యూఏఈ పలు కార్యక్రమాలు చేపడుతోంది.
తాజా వార్తలు
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?







