రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. 309 మంది అరెస్టు
- November 14, 2021
కువైట్: రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కువైట్ ప్రభుత్వం ఉక్కపాదం మోపుతుంది. నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు మొత్తం 309 మందిపై కేసులు నమోదు చేసిన అధికారులు వారిని అరెస్టు చేశారు. ఇందులో 250 మంది రెసిడెన్సీ గడువు ముగిసిన వారు ఉండగా.. 59 మంది కన్పించకుండా పోయిన వారు ఉన్నారు. ఇదే సమయంలో 71 డ్రగ్స్, ఆల్కహాల్ సంబంధిత కేసులను కూడా నమోదు చేశారు. ఈ కేసులను నార్కోటిక్స్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్కు రిఫర్ చేశారు. ఆరు గవర్నరేట్లలోని 256 చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిని అరెస్టులు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 80 వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు. అన్ని గవర్నరేట్లలో తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









