రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. 309 మంది అరెస్టు
- November 14, 2021
కువైట్: రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కువైట్ ప్రభుత్వం ఉక్కపాదం మోపుతుంది. నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు మొత్తం 309 మందిపై కేసులు నమోదు చేసిన అధికారులు వారిని అరెస్టు చేశారు. ఇందులో 250 మంది రెసిడెన్సీ గడువు ముగిసిన వారు ఉండగా.. 59 మంది కన్పించకుండా పోయిన వారు ఉన్నారు. ఇదే సమయంలో 71 డ్రగ్స్, ఆల్కహాల్ సంబంధిత కేసులను కూడా నమోదు చేశారు. ఈ కేసులను నార్కోటిక్స్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్కు రిఫర్ చేశారు. ఆరు గవర్నరేట్లలోని 256 చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిని అరెస్టులు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 80 వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు. అన్ని గవర్నరేట్లలో తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







