రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. 309 మంది అరెస్టు
- November 14, 2021
కువైట్: రెసిడెన్సీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కువైట్ ప్రభుత్వం ఉక్కపాదం మోపుతుంది. నవంబర్ 6 నుండి నవంబర్ 12 వరకు మొత్తం 309 మందిపై కేసులు నమోదు చేసిన అధికారులు వారిని అరెస్టు చేశారు. ఇందులో 250 మంది రెసిడెన్సీ గడువు ముగిసిన వారు ఉండగా.. 59 మంది కన్పించకుండా పోయిన వారు ఉన్నారు. ఇదే సమయంలో 71 డ్రగ్స్, ఆల్కహాల్ సంబంధిత కేసులను కూడా నమోదు చేశారు. ఈ కేసులను నార్కోటిక్స్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్కు రిఫర్ చేశారు. ఆరు గవర్నరేట్లలోని 256 చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిని అరెస్టులు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 80 వాహనాలను కూడా అధికారులు సీజ్ చేశారు. అన్ని గవర్నరేట్లలో తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







