కన్నీళ్లు పెట్టుకున్న శ్రీరాముడు..ఆందోళనలో భక్తులు
- November 15, 2021విగ్రహాలు పాలు తాగడం, విభూతి రాల్చడం వంటి వాటి గురించి గతంలో విన్నాం. వాటిపై వచ్చిన కథనాలు చదివాం. కంచిలోని నటరాజ స్వామి వారి ఆలయంలోని విగ్రహానికి చెమట్లు పడుతుంటాయనే సంగతి ఆ దేవాలయాన్ని దర్శించిన భక్తులకు తెలుసు.
అలా ఎందుకు జరుగుతుందనేది రహస్యం. ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాగా, ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కొనకమిట్ల మండలంలో మునగపాడు గ్రామంలో రామాలయం ఉంది. ఆ ఆలయంలోని రాములవారి విగ్రహం కంటి నుంచి నీరు కారుతున్నది.
గర్భగుడిలోని రాములవారు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాల నుంచి కన్నీరు కారుతుండటంతో గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందారు. ఉదయం నుంచి రాత్రి వరకు కన్నీరు కారుతూనే ఉన్నదని, రాత్రి పూజలు పూర్తైన తరువాత కన్నీరు ఆగిపోయిందని, గ్రామంలో ఆలయాన్ని నిర్మించి వందేళ్లు దాటిపోయిందని, కరోనా కారణంగా గత రెండేళ్లుగా రామాలయంలో కళ్యాణం నిర్వహంచికపోవడం వలనే ఇలా జరిగి ఉండొచ్చని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల