కన్నీళ్లు పెట్టుకున్న శ్రీరాముడు..ఆందోళనలో భక్తులు
- November 15, 2021
విగ్రహాలు పాలు తాగడం, విభూతి రాల్చడం వంటి వాటి గురించి గతంలో విన్నాం. వాటిపై వచ్చిన కథనాలు చదివాం. కంచిలోని నటరాజ స్వామి వారి ఆలయంలోని విగ్రహానికి చెమట్లు పడుతుంటాయనే సంగతి ఆ దేవాలయాన్ని దర్శించిన భక్తులకు తెలుసు.
అలా ఎందుకు జరుగుతుందనేది రహస్యం. ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాగా, ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని కొనకమిట్ల మండలంలో మునగపాడు గ్రామంలో రామాలయం ఉంది. ఆ ఆలయంలోని రాములవారి విగ్రహం కంటి నుంచి నీరు కారుతున్నది.
గర్భగుడిలోని రాములవారు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని విగ్రహాల నుంచి కన్నీరు కారుతుండటంతో గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందారు. ఉదయం నుంచి రాత్రి వరకు కన్నీరు కారుతూనే ఉన్నదని, రాత్రి పూజలు పూర్తైన తరువాత కన్నీరు ఆగిపోయిందని, గ్రామంలో ఆలయాన్ని నిర్మించి వందేళ్లు దాటిపోయిందని, కరోనా కారణంగా గత రెండేళ్లుగా రామాలయంలో కళ్యాణం నిర్వహంచికపోవడం వలనే ఇలా జరిగి ఉండొచ్చని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







