యూఏఈ, సౌదీ, ఖతార్ దేశాల నుంచి వ్యాక్సినేషన్ పొందిన ప్రయాణీకుల్ని అనుమతించనున్న సింగపూర్
- November 16, 2021
ఖతార్: క్వారంటైన్ లేకుండా ప్రయాణీకుల్ని అనుమతించేందుకు సింగపూర్ సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సిన్ పొందిన ప్రయాణీకులకు ఈ అవకాశం కల్పిస్తారు. యూఏఈ, ఇండియా, ఇండోనేసియా మరియు సౌదీ అరేబియా దేశాలకు చెందినవారిని అనుమతించనున్నారు. నవంబర్ 29 నుంచి వ్యాక్సిేషన్ పొందిన ప్రయాణీకుల్ని ఇండియా, ఇండోనేసియా నుంచి సింగపూర్కి అనుమతిస్తారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఖతార్ నుంచి వచ్చేవారికి డిసెంబర్ 6 నుంచి అనుమతిస్తారు. 12 ఏళ్ళ లోపు చిన్నారులు తమ తల్లిదండ్రులతో వెళ్ళవచ్చు. షార్ట్ టెర్మ్ విజిటర్లు లాంగ్ టెర్మ్ పాస్ కలిగినవారి అప్లికేషన్లు నవంబర్ 22 నుంచి (ఇండియా, ఇండోనేసియా) ప్రారంభమవుతాయి. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియాకి చెందినవారికి నవంబర్ 29 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం వుంది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







