2022 నుంచి ఉద్యోగులు ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పనిచేయొచ్చు
- November 16, 2021
యూఏఈ: 2022 ఫిబ్రవరి 2 నుంచి ఉద్యోగులు, ఒకరి కంటే ఎక్కువమంది యజమానుల వద్ద పని చేయొచ్చు. ఈ మేరకు కొత్త లేబర్ చట్టం ప్రకటితమైంది. ఫెడరల్ చట్టం 33 - 201 ప్రకారం, ప్రైవేటు సెక్టారులోని ఉద్యోగులు పార్ట్ టైమ్, తాత్కాలికం లేదా ఫ్లెక్సిబుల్ విధానంలో పని చేయవొచ్చు. రెగ్యులర్ పార్ట్ టైమ్ స్కీమ్ ద్వారా ఉద్యోగుల హక్కులను పరిరక్షించేలా రెండు మార్గాల్లో అవకాశం కల్పిస్తున్నారు. పని కోసం ప్రత్యేకంగా కేటాయించిన గంటలు, లేదా రోజుల్లో పార్ట్ టైమ్ వర్క్ ఉద్యోగులకు అనుమతించబడుతుంది. ప్రత్యేక సమయానికి తాత్కాలికంగా పని అవకాశం కల్పిస్తారు. ఫ్లెక్సిబుల్ వర్క్ ద్వారా ఉద్యోగులకు చాలా వెసులుబాటు కలుగుతుంది. యజమానికి సంబంధించి పనికి తగ్గట్టుగా ఇది సులభతరంగా వుంటుంది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







