పునీత్ రాజ్ కుమార్ కు 'కర్ణాటక రత్న' అవార్డు
- November 17, 2021
దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక ప్రభుత్వం 'కర్ణాటక రత్న' పురస్కారాన్ని అందజేయనుంది. ఈ మేరకు తాజాగా బెంగళూరులో సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటన చేశారు.
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ) కన్నడ సినీ నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఘాలతో కలిసి ఏర్పాటు చేసిన 'పునీత నమన' సంస్మరణ సభలో సీఎం ఈ విషయాన్ని ప్రకటించారు.
పునీత్ను జాతీయ స్థాయి అవార్డులతో సత్కరించాలన్న అభిమానుల కోరికను కూడా రాబోయే మంత్రివర్గంలో పరిశీలిస్తామని సీఎం బసవరాజ్ తెలిపారు. పునీత్ కర్నాటక ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన 'కన్నడ కంఠీర్వ' 10వ గ్రహీత. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. పునీత్ పేరును 'పద్మశ్రీ' అవార్డుకు సిఫార్సు చేయాలని సిఎంను అభ్యర్థించింది.
46 ఏళ్ల వయసులో పునీత్ అక్టోబరు 29న భారీ గుండెపోటుతో మరణించారు. అక్టోబరు 31న బెంగళూరులోని కంఠీరవ స్టూడియోస్లో ఆయన తండ్రి, తల్లి సమాధి పక్కన పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మరణానంతరం పునీత్ రాజ్కుమార్ ఈ అత్యున్నత పురస్కారం ప్రకటించడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







