షార్జాలో ప్లాంట్ ను ప్రారంభించిన మొదటి ఇండియన్ చమురు సంస్థ
- November 18, 2021
షార్జా: షార్జాలో ఇండియన్ చమురు సంస్థ అయిన సిద్ధార్థ్ గ్రీస్ అండ్ లూబ్స్ వాళ్ల సబ్సిడరీ ట్రినిటి లూబ్స్ అండ్ గ్రీస్ తన ప్లాంట్ ను ప్రారంభించింది. షార్జాలోని హమరియా ఫ్రీ జోన్ అథారిటీ పోర్ట్ లో దీన్ని ఏర్పాటు చేశారు. భారత పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి ఈ ప్లాంట్ ను ఓపెన్ చేశారు. షార్జా లో భారత్ కు చెందిన చమురు ప్లాంట్ ను ప్రారంభించటం ఇదే తొలిసారి కావటం విశేషం. దాదాపు 50 మిలియన్ల దిర్హామ్స్ ను ప్లాంట్ ఏర్పాటు కోసం ఇన్వెస్ట్ చేశారు. మొత్తం 12, 500 స్క్వేర్ మీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్లాంట్ లో ఏటా 50 మిలియన్ల లీటర్ల గ్రీస్, చమురును ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ పూర్తిగా ఆటోమేటేడ్. ఆటోమెబైల్, ఇండస్ట్రీస్ కావాల్సిన చమురుతో పాటు ఎలక్టిక్ వెహికల్స్ అవసరమైన ఆయిల్ ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







