60 ఏళ్లు దాటిన వారికి ఆప్షన్.. యువతకు అవకాశం..!
- November 18, 2021
కువైట్: 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అధికారులు పదవీ విరమణ కోసం దరఖాస్తులను సమర్పించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇప్పటికే వివిధ ర్యాంక్లకు చెందిన 200 మంది అధికారులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దరఖాస్తులను సమర్పించారు. పదవీ విరమణ, సర్వీస్ పొడిగింపు కోసం వాటిని మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రిఫర్ చేయనున్నారు. “ఈ విధానం మధ్య స్థాయి అధికారులను ఉన్నత స్థానాలకు పదోన్నతి పొందేందుకు అనుమతిస్తుంది. అలాగే కొంతమంది సీనియర్ అధికారులకు రిటైర్మెంట్ ఇవ్వడం ద్వారా యువ రక్తానికి చోటు కల్పించాలి. ప్రత్యేకించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునర్నిర్మాణానికి ఇది అవసరం. అదే విధంగా కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతిక అభివృద్ధిని వివిధ స్థాయుల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలి.’’ అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఓ అధికారి తెలిపాడు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







