దుబాయ్ ఎక్స్ పో- 2020 కి అనుహ్య స్పందన...
- November 23, 2021
దుబాయ్:దుబాయ్ ఎక్స్ పో 2020 కి ఊహించిన దాని కన్నా ఎక్కువ స్పందన లభిస్తోంది. ప్రపంచ దేశాల సంప్రదాయాలను, సంస్కృతులను ఒక్క దగ్గరికి చేర్చిన ఈ ఎక్స్ పో ను చూసేందుకు అన్ని దేశాల విజిటర్స్ ఆసక్తి చూపుతున్నారు. అందుకే ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ మంది ఈ ఎక్స్ పో ను సందర్శిస్తున్నారు. 51 రోజుల్లోనే ఏకంగా 4 మిలియన్ల కన్నా ఎక్కువ మంది ఈ ఎక్స్ పో ను సందర్శించటం విశేషం. ఈ వీకెండ్ లో ఎక్స్ పో లో పలు స్పోర్ట్స్, మ్యూజికల్ ఈవెంట్స్ ఉండటం తో పాటు వీకెండ్ పాస్ ను 45 దిర్హామ్స్ కే అందజేశారు. దీంతో ఏకంగా 1,20,000 మంది ఈ వీకెండ్ విజిటర్స్ పాస్ ను తీసుకున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ఎక్స్ పో కొనసాగనుంది. అప్పటి వరకు కనీసం 2 కోట్ల మంది విజిట్ చేస్తారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









