తనికెళ్ళ భరణికి లోక్ నాయక్ పురస్కారం
- November 23, 2021
ప్రముఖ నటుడు, రచయిత, సాహితీ వేత్త తనికెళ్ళ భరణికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రకటించింది. జనవరి 18న ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ వర్థంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అయనకు అందచేయనున్నారు. ఈ మేరకు లోక్ నాయక్ ఫౌండేషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. సోమవారం ఆంధ్రాయూనివర్శిటీలో మీడియాకు తెలియచేశారాయన. ఇప్పటి వరకూ ఈ పురస్కారం కింద లక్షరూపాయల నగదుని బహుమతిగా అందచేసి సత్కరిస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది రెండు లక్షల నగదును బహుమతిగా అందచేసి సత్కరించనున్నట్లు తెలిపారు లక్ష్మీప్రసాద్. గతంలో భరణికి పలు సాంస్కృతిక అవార్డులతో పాటు ప్రభుత్వ నంది అవార్దులు కూడా లభించాయి. ఇప్పడు ఈ లోక్ నాయక్ పురస్కారం ఆయన కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా భావించవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









