1000 కోట్లివ్వాలని ప్రధానికి జగన్ వినతి పత్రం..
- November 24, 2021అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద సహాయం కింద రూ. 1000 కోట్లు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు జగన్.ఇవాళ ఉదయం ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇంచార్జీలతో సీఎం సమీక్షించారు. ఈ సమీక్షలో ఆయా ప్రాంతాల్లో పంట నష్టం, ప్రాణ నష్టం గురించి ఆరా తీశారు. ప్రాథమికంగా ఆయా జిల్లాల్లో జరిగిన నష్టాల గురించి కూడా సీఎం ఆరా తీశారు. మరో వైపు ఆయా ప్రాంతాల్లో నష్టంపై సమగ్రంగా నివేదికను తయారు చేయాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల కారణంగా చోటు చేసుకొన్న నష్టంపై అధికారులు ప్రాథమికంగా నష్టం అంచనాలను తయారు చేశారు. ఈ నష్టం అంచనా ఆధారంగా సీఎం జగన్ ప్రధాని మోడీ ని రూ.1000 కోట్లు ఇవ్వాలని కోరారు. మరో వైపు రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కూడా సీఎం జగన్ ఆ లేఖలో కోరారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత