వరద సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు
- November 24, 2021
వరద సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. మానవ తప్పిదంతోనే తిరుపతిలో వరద భీభత్సం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి గాల్లో వచ్చి గాల్లో వెళ్లిపోతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే అన్నమయ్య రిజర్వాయర్, పింఛా నదులు కట్టలు తెంచుకున్నాయని విమర్శించారు.
చిత్తూరు జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. సీఎం జగన్తో పాటు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాపానాయుడుపేటలో వరద బాధితులను పరామర్శించారు. కుప్పంలో దొంగ ఓటర్లను దింపి టీడీపీని ఓడించారన్నారు చంద్రబాబు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుని, గౌరవ సభలో అడుగుపెడతానని చెప్పుకొచ్చారు.
తనను అసెంబ్లీలో మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ లో తన సతీమణి గురించి వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడటం బాధనిపించిందన్నారు. క్లైమోర్ మెన్స్కే భయపడలేదని వైసీపీ నేతలు ఒక లెక్క కాదని అన్నారు. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని, ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామని సవాల్ విసిరారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







