బయోమెట్రిక్ నిబంధనల ఉల్లంఘన... 207 మంది ఉద్యోగులకు నో సాలరీ
- November 25, 2021కువైట్: బయోమెట్రిక్ హాజరు నిబంధనలను పాటించనందుకు సమాచార మంత్రిత్వ శాఖ 207 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా నిలిపివేసింది. సివిల్ సర్వీస్ కమిషన్ (CSC) జారీ చేసిన సూచనల అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొంతమంది ఉద్యోగుల్లో నిబద్ధత లేకపోవడం, బయోమెట్రిక్ హాజరు వ్యవస్థకు విఘాతం కలిగించడం లాంటి చర్యలను మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల్లో గుర్తించారు. ఈ గందరగోళం కారణంగా ఉద్యోగుల్లో విభేదాలు తలెత్తాయి. ఈ కారణంగా CSC సమన్వయంతో జీతాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను పాటించాల్సిందేనని రెగ్యులేటరీ అధికారుల చేసిన సిఫార్సుల కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు సిస్టంను CSCతో అనుసంధానించలేదని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారని...ఆ కారణంగానే లేటుగా వస్తున్నారని అధికారులు గుర్తించారు. కానీ CSCతో బయోమెట్రిక్ అనుసంధానం ఎప్పుడు జరిగిపోయిందని ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని అధికారులు కోరారు. అటు కొందరు ఉన్నత ఉద్యోగులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ నివేదికలో తెలిపినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వారిపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు