మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... ప్రపంచ వ్యాప్తంగా 259.61 మిలియన్ల మందికి వైరస్
- November 27, 2021
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ ఎఫెక్ట్ తగ్గిందని అంతా భావిస్తున్నప్పటికీ చాపకింద నీరులా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. తాజాగా సౌత్ ఆఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగానూ మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం వరకు కేసులు తక్కువగా నమోదైనప్పటికీ...మళ్లీ వాటి సంఖ్య వేగంగా పెరగుతుండటం ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 259.61 మిలియన్లకు చేరింది.ఇది అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా ఇంత కన్నా ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. ఇక మహమ్మరి కారణంగా 54,36, 733 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 డిసెంబర్ లో చైనా లో తొలి కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల కాలంలోనే ఇది ప్రపంచ దేశాలను చుట్టుముట్టింది. మొత్తం 210 దేశాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఐతే ఇప్పటికీ కరోనా ప్రమాదం పొంచి ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ప్రజలంతా మాస్క్ ధరించి, శానిటైజేషన్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తోంది.
తాజా వార్తలు
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్
- JEE మెయిన్ సెషన్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..
- అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్
- ఇంద్రకీలాద్రి వసంతోత్సవాలకు పోటెత్తిన భక్తులు









