ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు సూచనలు జారీ

- November 28, 2021 , by Maagulf
ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు సూచనలు జారీ

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండడంతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారత్‌లో కూడా ప్రధాని మోడీ శనివారం ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై కరోనా కొత్త వేరియంట్ గురించి చర్చించారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖలు రాశారు. కొత్త వేరియంట్ దేశంలో ప్రవేశించే ప్రమాదం పొంచి ఉన్నందున ప్రభుత్వాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని లేఖలో సూచించారు. కొవిడ్ నిబంధనలన కఠినతరం చేయాలని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బయటపడితే ఆ వైరస్ సోకిన వారిపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com