శంషాబాద్ విమానాశ్రయంలో ఆంక్షలు...
- November 28, 2021హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆంక్షలు విధించారు.దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో శంషాబాద్ విమానాశ్రయం అప్రమత్తం అయింది.వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.హైదరాబాద్ విమానాశ్రయంకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.అదీ 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలి.విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక ప్రయాణికులకు మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే హోంక్వారంటైన్ లేదా ఆసుపత్రిలో చేరాలి.ప్రయాణికుల పరీక్షల కోసం విమానాశ్రయంలో మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు.దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్స్వానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు