యూఏఈ లో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం కంప్లీట్
- November 29, 2021
యూఏఈ : కరోనా వ్యాక్సినేషన్ లో యూఏఈ సూపర్ సక్సెస్ ను సాధించింది. దేశంలో దాదాపుగా 100 శాతం వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పూర్తి చేసింది. దీని అర్థం అందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైనట్లు కాదని యూఏఈ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికార ప్రతినిధి డాక్టర్ ఫరీదా అల్ హోసని తెలిపారు. రెండో డోసు పూర్తైతేనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయినట్లు చెప్పారు. ఐతే ఒక్క డోస్ మాత్రం 100 శాతం ప్రజలకు ఇవ్వగలిగామని అన్నారు. దీంతో కరోనా రిస్క్ ను చాలా వరకు తగ్గించినట్లైందన్నారు. అటు వర్క్ వీసా మీద దేశానికి వచ్చే ప్రవాసులకు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తైతేనే అనుతించాలని విదేశీ మంత్రిత్వశాఖ అధికారులను డాక్టర్ అల్ హోసని కోరారు. వీలైనంత త్వరగా దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ను పూర్తి చేస్తామన్నారు. మూడేళ్లు అంతకన్నా ఎక్కువ వయసు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందన్నారు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









