వృద్ధాశ్రమంలో కరోనా కలకలం..67 మందికి నిర్ధారణ
- November 29, 2021
ముంబై: మహారాష్ట్ర థానేలోని ఒక వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేగింది. ఏకంగా ఆశ్రమంలోని 67 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణైంది.
వీరిలో ఐదుగురు వృద్ధాశ్రమ సిబ్బంది కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. వీరందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారని అన్నారు. ఆశ్రమంలో ఉంటున్న ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయంటూ నిర్వాహకులు ఫిర్యాదు చేయడంతో శనివారం భివాండి జిల్లా సొర్గావ్ గ్రామంలోని మాతోశ్రీ వృద్ధాశ్రమాన్ని సందర్శించినట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. ఇక్కడ ఉన్న 109 మంది వృద్ధులకు పరీక్షలు నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. దాంతో ఆశ్రమంలోని 67 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణైందని తెలిసింది. వారందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
మొత్తం 1,130 మంది జనాభా ఉన్న సొర్గావ్ గ్రామాన్ని ఈ మేరకు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. థానే జిల్లాలో ఇటీవల వెలుగులోకి వచ్చిన క్లస్టర్లలో అతి పెద్ద క్లస్టర్ ఇదేనని అన్నారు. 15 మంది శాంపిల్స్ను జినోమ్ స్వీక్వెన్సింగ్ కోసం పంపామని డా.కైలాష్ పవార్ తెలిపారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







