గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేళ అరుదైన ఫోటోని షేర్ చేసిన హమ్దాన్

- December 03, 2021 , by Maagulf
గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేళ అరుదైన ఫోటోని షేర్ చేసిన హమ్దాన్

దుబాయ్: యూఏఈ 50వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ తన కవల పిల్లలు షేఖా, రషీద్‌లతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రతి సందర్భాన్ని తన అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన యూఏఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ అరుదైన ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఫోటోలో పిల్లలిద్దరి మొఖాలను చూపకున్నా.. వారు ట్రెడిషనల్ ఎమిరాటీ డ్రెస్ ల్లో మెరిసిపోయారు. షేఖా UAE నేషనల్ ప్లాగ్ రంగుల డ్రెస్ వేసుకోగా.. రషీద్ ట్రెడిషనల్ తెల్లని కందురాలో ఉన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com