కువైట్ లో అవినీతి నిర్మూలనకు మరిన్ని చర్యలు...
- December 08, 2021
కువైట్: దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ను మరింత బలోపేతం చేయనుంది. ఈ మేరకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నజాహా చైర్మన్, అబ్దుల్ అజీజ్ అల్-ఇబ్రహీం తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా UN కన్వెన్షన్, అరబ్ అవినీతి వ్యతిరేక సదస్సులో కువైట్ చేరడంతోనే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. పాలస్తీనా అవినీతి నిరోధక అథారిటీ మూడవ అంతర్జాతీయ సదస్సులో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి చట్టాల రూపకల్పనకు నజాహా కృషి చేసిందన్నారు. ఆడిటింగ్ మోసాలు, పబ్లిక్ టెండర్లలో మోసాలను కనిపెట్టేందుకు సెంట్రల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడంతోపాటు పాలనలో పారదర్శకతకు నజాహా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థిరమైన అభివృద్ధి 2030 లక్ష్యాలను సాధించే ప్రయత్నాలలో నజాహా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!







