కువైట్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
- December 08, 2021
కువైట్ సిటీ:కువైట్ లో ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు నమోదయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఒమిక్రాన్ కేసు ఆఫ్రికన్ దేశాల్లో నుండి వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ నమోదైందని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనాద్ తెలిపారు.ప్రయాణికుడు కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు మోతాదులను గతంలో తీసుకున్నాడు మరియు ఇప్పుడు అతను ఆరోగ్య ప్రోటోకాల్ల ప్రకారం క్వారైంటేన్ లో ఉన్నాడని అల్-సనద్ ధృవీకరించారు.అనేక దేశాలు కొత్త వేరియంట్ను కనుగొన్నట్లు ప్రకటించడంతో మంత్రిత్వ శాఖ అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం, కువైట్లో మహమ్మారి పరిస్థితి స్థిరంగా ఉందని అయినప్పటికీ, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మంత్రిత్వ శాఖకు సహాయపడటానికి పౌరులు & నివాసితులు బూస్టర్ వ్యాక్సిన్ షాట్ తీసుకోవాలని సూచించారు.కొత్త వేరియంట్కు వ్యతిరేకంగా ప్రస్తుత వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనాలు చూపించాయని ఆయన తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







