కువైట్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు
- December 08, 2021
కువైట్ సిటీ:కువైట్ లో ఒమిక్రాన్ వేరియంట్ తొలి కేసు నమోదయినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.ఒమిక్రాన్ కేసు ఆఫ్రికన్ దేశాల్లో నుండి వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ నమోదైందని మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనాద్ తెలిపారు.ప్రయాణికుడు కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు మోతాదులను గతంలో తీసుకున్నాడు మరియు ఇప్పుడు అతను ఆరోగ్య ప్రోటోకాల్ల ప్రకారం క్వారైంటేన్ లో ఉన్నాడని అల్-సనద్ ధృవీకరించారు.అనేక దేశాలు కొత్త వేరియంట్ను కనుగొన్నట్లు ప్రకటించడంతో మంత్రిత్వ శాఖ అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం, కువైట్లో మహమ్మారి పరిస్థితి స్థిరంగా ఉందని అయినప్పటికీ, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మంత్రిత్వ శాఖకు సహాయపడటానికి పౌరులు & నివాసితులు బూస్టర్ వ్యాక్సిన్ షాట్ తీసుకోవాలని సూచించారు.కొత్త వేరియంట్కు వ్యతిరేకంగా ప్రస్తుత వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయని అధ్యయనాలు చూపించాయని ఆయన తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







