పెద్ద మనసు చాటుకున్న లులు గ్రూప్ అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీ
- December 09, 2021
కేరళ: లులు గ్రూప్ అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆర్థిక కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి అండగా నలిచి.. ఆ కుటుంబం కష్టాలను తీర్చారు.ఈ క్రమంలో ఆయన చేసిన పని స్థానికంగా చర్చనీయాంశం అయింది.కాగా.. ఇంతకూ ఆయన ఏం చేశారు అనే వివరాల్లోకి వెళితే..
లులు గ్రూప్స్ అధినేత యూసుఫ్ అలీ, అతడి కుటంబ సభ్యులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఈ ఏడాది ఏప్రిల్లో కేరళలోని పనాన్గఢ్లో స్వల్ప ప్రమాదానికి గురైంది. దీంతో భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్థానిక ప్రజలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వారిని ఆసుపత్రికి తరలించే వరకూ అక్కడే ఆశ్రయం కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం రోజు యూసుఫ్ అలీ పనాన్గఢ్లో పర్యటించి.. అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కంజీరామోత్తమ్ ప్రాంతానికి చెందిన అమీనా.. యూసుఫ్ అలీని కలిసి తన కష్టాలను చెప్పుకున్నారు.కూతురు పెళ్లి కోసం భూమి, ఇల్లును తాకట్టు పెట్టి.. లోన్ తీసుకున్నట్టు వెల్లడించారు.అయితే భర్త క్యాన్సర్ చికిత్స కోసం అధిక మొత్తంలో ఖర్చవుతున్నందున లోన్ తీర్చలేదని.. దీంతో బ్యాంక్ వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూసుఫ్ అలీ.. ఆమెకు అండగా నిలిచారు. ఆమె కట్టాల్సిన డబ్బును తానే కడతానని పేర్కొన్నారు.చెప్పిన విధంగా రూ. 3.81లక్షలను బ్యాంకులో కట్టేశారు. అంతేకాకుండా..అమీనా భర్త చికిత్స కోసం రూ.50,000 ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







