కీలక నిర్ణయం తీసుకున్న కువైట్ ప్రభుత్వం
- December 09, 2021కువైట్ సిటీ: కువైట్ ఇటీవల మహిళల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలను కూడా ఆర్మీలో చేరే అవకాశం కల్పిస్తూ అక్టోబర్లో కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి తాజాగా ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి షేక్ హమద్ జాబర్ అల్ అలీ అల్ సబా బుధవారం మీడియా సమావేశంలో ఓ ప్రకటన చేశారు.ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న మహిళల కోసం డిసెంబర్ 19 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు."మేము మహిళలను సైన్యంలో చేరమని బలవంతం చేయలేదు.సైన్యంలోని పురుష అధికారులతో సమానమైన ప్రయోజనాలను పొందడానికి మాత్రమే మేము వారికి అవకాశం ఇచ్చాము" అని మంత్రి అన్నారు. కువైటీ మహిళలు ఇప్పటికే రక్షణశాఖలో పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఆసక్తి ఉన్నవారు సైన్యంలో చేరే ఈ సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షేక్ హమద్ జాబర్ అల్ అలీ అల్ సబా తెలియజేశారు.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్