భారత సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతులకు కువైట్ అమీర్ సంతాపం
- December 10, 2021
కువైట్: ఇండియాలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్) సహా ఇతర ఉన్నతాధికారులకు కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా సంతాపం తెలిపారు. ఈమేరకు ఆయన భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు గురువారం లేఖ పంపారు. ప్రమాదంలో గాయపడ్డ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ వరుణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, ప్రధాన మంత్రి షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబా కూడా ప్రమాదంపై తమ సంతాపం తెలియజేశారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్తో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి ,కువైట్)
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







