‘పుష్ప’ మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీకి తేదీ ఖరారు
- December 09, 2021
హైదరాబాద్: అల్లు అర్జున్ పుష్ప క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే.సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్,సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి.ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం.ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు.డిసెంబర్ 12 న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
“థియేటర్లో కన్నా ముందే మాస్ పార్టీ.. మాస్ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న గ్లింప్స్..పుష్ప మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీ..డిసెంబర్ 12 న” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్టర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లుగా ఎవరు రానున్నారో చెప్పకపోవడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఈవెంట్ కి గెస్ట్ లు ఎవరైనా వస్తున్నారా ..? అని ప్రశ్నిస్తున్నారు.కాగా, ఈ ఈవెంట్ కి ప్రభాస్, చిరు, షాహిద్ కపూర్ గెస్టులుగా వస్తున్నారంటూ పుకార్లు వినిపించాయి.కానీ, మేకర్స్ అందులో ఒక్కరిపేరు కూడా చెప్పకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







