‘పుష్ప’ మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీకి తేదీ ఖరారు
- December 09, 2021
హైదరాబాద్: అల్లు అర్జున్ పుష్ప క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే.సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్,సాంగ్స్ హైప్ ని క్రియేట్ చేశాయి.ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచారు చిత్రబృందం.ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు.డిసెంబర్ 12 న యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
“థియేటర్లో కన్నా ముందే మాస్ పార్టీ.. మాస్ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న గ్లింప్స్..పుష్ప మాస్సివ్ ప్రీ రిలీజ్ పార్టీ..డిసెంబర్ 12 న” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ పోస్టర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ లుగా ఎవరు రానున్నారో చెప్పకపోవడంతో అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఈవెంట్ కి గెస్ట్ లు ఎవరైనా వస్తున్నారా ..? అని ప్రశ్నిస్తున్నారు.కాగా, ఈ ఈవెంట్ కి ప్రభాస్, చిరు, షాహిద్ కపూర్ గెస్టులుగా వస్తున్నారంటూ పుకార్లు వినిపించాయి.కానీ, మేకర్స్ అందులో ఒక్కరిపేరు కూడా చెప్పకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







