WHO డైరెక్టర్ జనరల్ను కలిసిన అబుదాబి ప్రిన్స్
- December 12, 2021
యూఏఈ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ను అబుదాబి ప్రిన్స్, UAE సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు కలుసుకుని చర్చించారు. ఈ సందర్భంగా WHO డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఆరోగ్య సంస్థ లక్ష్యాలను, కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలను షేక్ మహమ్మద్ కు వివరించారు. ప్రాంతీయ, అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లపై వారు చర్చించారు. ఎమిరేట్స్ లో పోలియో క్యాంపెయిన్, రివర్ బ్లైండ్ నెస్, గినియా వార్మ్ వ్యాధిని నిర్మూలించేందుకు చేస్తున్న షేక్ మహమ్మద్ కృషిని టెడ్రోస్ అభినందించారు. COVID-19 మహమ్మారి నేపథ్యంలో అనేక దేశాలలో వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ కార్మికులకు UAE చేసిన సహాయాన్ని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో WHO చేపట్టే కార్యక్రమాలకు అండగా నిలుస్తామని, మహమ్మారిని నిర్మూలించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ WHO డైరెక్టర్ జనరల్ కు హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









