ప్రవాసుల కార్ల సంఖ్యపై నియంత్రణ.. ఎంపీ ప్రతిపాదన
- December 14, 2021
కువైట్: దేశంలో ట్రాఫిక్ రద్దీని, ప్రమాదాలను నివారించేందుకు ప్రవాసుల పేరు మీద ఉండే కార్ల సంఖ్యను పరిమితం చేయనున్నారు.ఈ మేరకు పార్లమెంటేరియన్ డాక్టర్ అబ్దుల్లా అల్-తారిజీ ప్రతిపాదనను సమర్పించారు. దీని ప్రకారం.. ప్రవాసులు తన వినియోగానికి రెండు కార్లు మాత్రమే తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంతకుమించిన ప్రతి వాహనంపై అదనపు ఫీ విధించాలని ఆయన తన ప్రతిపాదనలో కోరారు. దేశంలో ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాత వాహనాలు కొని తిరుగుతున్నారని, దీంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం తో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు. అలాగే పబ్లిక్ గ్రౌండ్స్, స్కూల్స్ పార్కింగ్ స్థలాలు, మసీదులు, షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ కష్టాలు ఎదురవుతున్నాయని ఎంపీ డాక్టర్ అబ్దుల్లా అల్-తారిజీ తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. కొంతమంది ప్రవాసులు తమ పేరు మీద 50 వరకు కార్లను కలిగి ఉన్నారని వార్తలు వచ్చిన విషయాన్ని కూడా అతను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







