ప్రవాసుల జీతాల పెంపు పై PAM ఆంక్షలు. మండిపడుతున్న కార్మికులు
- December 15, 2021
కువైట్: ప్రైవేట్ రంగ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల జీతాల పెంపును పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) 'అంతర్గత సర్క్యులర్' తీవ్ర విమర్శల పాలయింది. ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అంటూ కార్మికులు మండిపడుతున్నారు. అలాగే జీతాల చెల్లింపులో వివక్ష చూపుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఏడాదికి 50 దీనార్ల కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా నిషేధిస్తూ PAM సర్క్యులర్ వివాదమైంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నాన్-గ్రాడ్యుయేట్ ప్రవాసుల నివాస పునరుద్ధరణను నిరోధించడానికి PAM జారీ చేసిన నిర్ణయాన్ని న్యాయవ్యవస్థ రద్దు చేసినప్పటికీ, ఇది చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. విదేశీ ఉద్యోగుల జీతాలను 50 దీనార్లు లేదా అంతకంటే ఎక్కువ పెంచాలా వద్దా అనే నిర్ణయాన్ని కంపెనీల అభీష్టానికే వదిలేయాలని కార్మికులు అంటున్నారు. కార్మికుల నైపుణ్యం మేరకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకుంటాయని, ఆమేరకే చెల్లింపులు చేస్తాయంటున్నారు. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









