ప్రవాసుల జీతాల పెంపు పై PAM ఆంక్షలు. మండిపడుతున్న కార్మికులు
- December 15, 2021
కువైట్: ప్రైవేట్ రంగ కంపెనీలు తమ విదేశీ ఉద్యోగుల జీతాల పెంపును పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) 'అంతర్గత సర్క్యులర్' తీవ్ర విమర్శల పాలయింది. ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అంటూ కార్మికులు మండిపడుతున్నారు. అలాగే జీతాల చెల్లింపులో వివక్ష చూపుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఏడాదికి 50 దీనార్ల కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా నిషేధిస్తూ PAM సర్క్యులర్ వివాదమైంది. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న నాన్-గ్రాడ్యుయేట్ ప్రవాసుల నివాస పునరుద్ధరణను నిరోధించడానికి PAM జారీ చేసిన నిర్ణయాన్ని న్యాయవ్యవస్థ రద్దు చేసినప్పటికీ, ఇది చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. విదేశీ ఉద్యోగుల జీతాలను 50 దీనార్లు లేదా అంతకంటే ఎక్కువ పెంచాలా వద్దా అనే నిర్ణయాన్ని కంపెనీల అభీష్టానికే వదిలేయాలని కార్మికులు అంటున్నారు. కార్మికుల నైపుణ్యం మేరకు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకుంటాయని, ఆమేరకే చెల్లింపులు చేస్తాయంటున్నారు. ఇందులో ప్రభుత్వ జోక్యం అవసరం లేదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







