ఒమిక్రాన్ కేసులు మన దగ్గర లేవు-హెల్త్ మినిస్టర్
- December 15, 2021
కువైట్: కువైట్ కొత్తగా ఒమిక్రాన్ కేసులు ఏమీ నమోదు కాలేదని ఆరోగ్య మంత్రి షేక్ డాక్టర్ బాసిల్ అల్-సబాహ్ తెలిపారు. ఐతే కరోనా కేసుల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల ఉందని ఆయన అన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యూరోప్ లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో అలర్ట్ గా ఉన్నామన్నారు. యూరోప్ నుంచి వచ్చే సంఖ్య పెరిగిందని...వారికి కరోనా టెస్ట్ చేశాకే దేశంలోకి అనుమతిస్తున్నామని అన్నారు. నిషేధిత దేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జన్యు పరీక్షకు పంపుతున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని డాక్టర్ బాసిల్ అల్-సబాహ్ మరోసారి ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..









