అబుధాబికి వచ్చే వారికి కొత్త టెక్నాలజీతో ఒమిక్రాన్ టెస్ట్
- December 15, 2021
అబుధాబి: కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అబుధాబి ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది.ఇతర ఎమిరేట్ల నుంచి అబుధాబి వచ్చే వారికి ఇకపై EDE స్కానర్లతో చెక్ చేయనున్నారు.ఈ నిబంధనలు డిసెంబర్ 19 (ఆదివారం) నుంచి అమల్లోకి రానున్నాయని EDE స్కానర్ల టెక్నాలజీతో వ్యక్తులను ఆపకుండానే పాజిటివ్ కేసులను గుర్తించేందుకు వీలవుతుందని అధికారులు చెప్పారు. స్కానింగ్ లో పాజిటివ్ వచ్చిన వారికి 20 నిమిషాల్లో ఫలితం తేలే యాంటిజెన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ పాజిటివ్ వస్తే వారి శాంపిళ్లను ఒమిక్రాన్ ను గుర్తించేందుకు వీలుగా జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపనున్నారు. అబుధాబిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రేటు 0.05 శాతంగా ఉంది. నిరంతర పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఈవెంట్లలో గ్రీన్ పాస్ సిస్టమ్ వినియోగం, అధిక వ్యాక్సిన్ రేట్ వంటి నివారణ, ముందు జాగ్రత్త చర్యలతో ఇది సాధ్యమైందని అధికారులు వెల్లడించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









