అబుధాబికి వచ్చే వారికి కొత్త టెక్నాలజీతో ఒమిక్రాన్ టెస్ట్

- December 15, 2021 , by Maagulf
అబుధాబికి వచ్చే వారికి కొత్త టెక్నాలజీతో ఒమిక్రాన్ టెస్ట్

అబుధాబి: కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అబుధాబి ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది.ఇతర ఎమిరేట్ల నుంచి అబుధాబి వచ్చే వారికి ఇకపై EDE స్కానర్‌లతో చెక్ చేయనున్నారు.ఈ నిబంధనలు డిసెంబర్ 19 (ఆదివారం) నుంచి అమల్లోకి రానున్నాయని EDE స్కానర్‌ల టెక్నాలజీతో వ్యక్తులను ఆపకుండానే పాజిటివ్ కేసులను గుర్తించేందుకు వీలవుతుందని అధికారులు చెప్పారు. స్కానింగ్ లో పాజిటివ్ వచ్చిన వారికి 20 నిమిషాల్లో ఫలితం తేలే యాంటిజెన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ పాజిటివ్ వస్తే వారి శాంపిళ్లను ఒమిక్రాన్ ను గుర్తించేందుకు వీలుగా జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపనున్నారు. అబుధాబిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రేటు 0.05 శాతంగా ఉంది. నిరంతర పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఈవెంట్‌లలో గ్రీన్ పాస్ సిస్టమ్‌ వినియోగం, అధిక వ్యాక్సిన్ రేట్ వంటి నివారణ, ముందు జాగ్రత్త చర్యలతో ఇది సాధ్యమైందని అధికారులు వెల్లడించారు.  

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com