అబుధాబికి వచ్చే వారికి కొత్త టెక్నాలజీతో ఒమిక్రాన్ టెస్ట్
- December 15, 2021
అబుధాబి: కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అబుధాబి ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది.ఇతర ఎమిరేట్ల నుంచి అబుధాబి వచ్చే వారికి ఇకపై EDE స్కానర్లతో చెక్ చేయనున్నారు.ఈ నిబంధనలు డిసెంబర్ 19 (ఆదివారం) నుంచి అమల్లోకి రానున్నాయని EDE స్కానర్ల టెక్నాలజీతో వ్యక్తులను ఆపకుండానే పాజిటివ్ కేసులను గుర్తించేందుకు వీలవుతుందని అధికారులు చెప్పారు. స్కానింగ్ లో పాజిటివ్ వచ్చిన వారికి 20 నిమిషాల్లో ఫలితం తేలే యాంటిజెన్ పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ పాజిటివ్ వస్తే వారి శాంపిళ్లను ఒమిక్రాన్ ను గుర్తించేందుకు వీలుగా జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపనున్నారు. అబుధాబిలో కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రేటు 0.05 శాతంగా ఉంది. నిరంతర పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఈవెంట్లలో గ్రీన్ పాస్ సిస్టమ్ వినియోగం, అధిక వ్యాక్సిన్ రేట్ వంటి నివారణ, ముందు జాగ్రత్త చర్యలతో ఇది సాధ్యమైందని అధికారులు వెల్లడించారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి







