పేర్ని నాని చేతుల్లోకి సినిమాటోగ్రఫీ శాఖ
- December 15, 2021
ఏపీ: సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని రవాణా, సమాచార శాఖ బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయం హాట్ టాపిక్గా మారాయి. టికెట్ల ధరలు పెంచడం కుదరదని ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టింది. పెద్ద, చిన్నా అని తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. అయితే ఏపీ ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టుల ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేస్తూ.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు టికెట్లపై నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తే ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. అయితే డివిజన్ బెంచ్లో విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల ధరలన విషయలో విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో మంత్రి పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖను సీఎం అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!









