లండన్ ను వణికిస్తోన్న ఒమిక్రాన్..అత్యధికంగా రోజువారీ కేసులు నమోదు
- December 16, 2021
లండన్: కరోనా మహమ్మారి గ్రేట్ బ్రిటన్ ను ఓ రేంజ్ లో వణికిస్తోంది. గత 24గంటల్లో 78,610 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. ఇవే ఇప్పటివరకు దేశంలో అత్యధిక రోజువారీ కేసుల సంఖ్య.
కరోనా వైరస్ .. డెల్టా వేరియంట్తో పాటు, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్ లో ఇంత భారీ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. జనవరి 8న నమోదైన 68,053 కేసులో ఇప్పటి వరకూ అత్యధికం. రోజుకో రకంగా వైరస్ మార్పు తీసుకోవడంతో అక్కడ ప్రభుత్వం త్వరితగతిన టీకాలు వేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు.
బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ రోజురోజుకి ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. రెండు రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదు కానున్నాయని హెచ్చరించారు. అయితే కోవిడ్-19 బూస్టర్ డోస్ పనిచేస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓమిక్రాన్ ముప్పును నివారించడానికి ఈ ఏడాది చివరి నాటికి వృద్ధులకు బూస్టర్ డోస్ ఇవ్వాలని జాన్సన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి:
ఒమిక్రాన్ వేరియంట్ల సంఖ్య ప్రతి రెండు మూడు రోజులకు రెట్టింపు అవుతోందని UK ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. మరోవైపు, బుధవారం నుండి దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేశారు. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన సొంత పార్టీ నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇంగ్లండ్లో ఇప్పుడు నైట్క్లబ్లు, స్పోర్టింగ్ మ్యాచ్ల సహా ఇతర ఈవెంట్స్ కు హాజరు కావాలంటే.. డబుల్ వ్యాక్సినేషన్ వేసుకున్న ‘కోవిడ్ పాస్’ అని పిలవబడే సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది.
ఎంపీలు వ్యతిరేకంగా ఓటు:
99 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. మంగళవారం రాత్రి పార్లమెంటు కరోనా సరికొత్త నిబంధనలను ఆమోదించింది. ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిబంధనలకు మద్దతిస్తామని ప్రతిపక్ష లేబర్ పార్టీ ఇప్పటికే చెప్పింది. బుధవారం నుండి అటువంటి ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి టీకా సర్టిఫికేట్ లేదా గత 48 గంటల్లో RT PCR తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..