అడ్మిన్స్ కు ఊరట కలిగించే కొత్త ఫీచర్
- December 17, 2021
రోజు రోజుకీ వాట్సాప్ ను వినియోగించే వాళ్ల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఫీచర్స్ ని తీసుకు వస్తుంది.
పైగా వాట్సాప్ గ్రూప్స్ వినియోగం కూడా అంతకంతకూ పెరుగుతోంది. చాలా సందర్భాల్లో వాట్సాప్ గ్రూప్ లోని సభ్యులు పోస్ట్ చేసే పోస్టుల వల్ల అడ్మిన్స్ కు చాలా సమస్యలు వస్తాయి. అయితే ఈ కొత్త ఫీచర్ వల్ల కాస్త రిలీఫ్ ని అడ్మిన్స్ పొందొచ్చు. ఇక ఈ కొత్త ఫీచర్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. సాధారణంగా గ్రూప్ లో ఏదైనా మెసేజ్ ను డిలీట్ చేయాలంటే మెసేజ్ పంపిన వ్యక్తి మాత్రమే డిలీట్ చేయడం అవుతుంది.
అయితే ఆ సందర్భాలలో అడ్మిన్స్ కు ఇబ్బందులు ఎదురు కాకుండా వాట్సాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. అడ్మిన్ లు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే మెసేజ్ లను డిలీట్ చేయవచ్చు ఈ కొత్త ఫీచర్ తో. ఈ ఫీచర్ త్వరలోనే రానుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ విషయాన్ని తెలిపింది.
గ్రూప్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న మెసేజ్లను, అభ్యంతరకంగా ఉన్న మెసేజ్స్ ని గ్రూప్ అడ్మిన్స్ ఇక నుండి ఈజీగా డిలేట్ చెయ్యచ్చు. ఈ ఫీచర్ ద్వారా 16 సెకన్లు, 8 నిమిషాలు, గంటలో మెసేజ్ ను డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ఈ ఫీచర్ తో పాటు డిలీట్ మెసేజ్ ఫర్ ఎవ్రీవన్ అనే ఫీచర్ ను అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది.
తాజా వార్తలు
- ఏవియేషన్ హబ్గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







