ఒమిక్రాన్ డేంజర్ బెల్స్...62 వేలు పైగా కేసులు
- December 20, 2021
ప్రపంచ దేశాలు గత 2 సంవత్సరాలుగా కరోనా మహామ్మారితో పోరాడుతూనే ఉన్నాయి.కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలు ఎత్తి ప్రజలపై విరుచుకుపడుతోంది.మొన్నటి వరకు అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు సైతం డెల్టా వేరియంట్ను తట్టుకోలేక విలవిలలాడిపోయాయి.అయితే ఇప్పుడు గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతోంది.అంతేకాకండా ఆయా దేశాల ప్రజలపై దాని ప్రభావాన్ని చూపుడంతో భారీగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి.
అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62 వేలు దాటడంతో మరోసారి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.యూకేలో ఒక్కరోజే 10 వేల ఒమిక్రాన్ కేసులు నమోదవడం ఆందోళన కలిగించే విషయం.అంతేకాకుండా యూకేలోనే ఒమిక్రాన్ మరణాలు సంభవించడం ఆ దేశ ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ప్రస్తుతం యూకేలో 37,101 ఒమిక్రాన్ కేసులు ఉండగా, డెన్మార్క్లో 15,452, నార్వేలో 2,060, భారత్లో 152 తో పాటు ఒమిక్రాన్ పుట్టిన దేశమైన సౌతాఫ్రికాలో 1,247 కేసులు నమోదయ్యాయి.ఇప్పటికే పలు దేశాలు హైరిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలు విధించాయి.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









