అలనాటి జమునకు టి.గవర్నర్ చే సత్కారం
- December 21, 2021
హైదరాబాద్:వంశీ ఆర్ట్స్ థియేటర్స్ మరియు శుభోదయం గ్రూపు వారి సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 22 వ తేదీన రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటలకు కళాభారతి, ప్రజానటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ జమునా రమణారావు గారికి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, గౌరవనీయులు డాక్టర్ తమిళ ఇసై సౌందర్ రాజన్ గారిచే సత్కారము జరుగును.. వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా స్వర్ణ వంశీ మరియు శుభోదయం గ్రూపుల జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు.. అంతే కాకుండా డాక్టర్ సి.నారాయణరెడ్డి-ఆళ్ల స్వర్ణ కంకణంతో కూడా ఆమెను సత్కరిస్తారు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప సభా పతి మండలి బుద్ధప్రసాద్ కొత్త కవితలు-1 కవితా సంకలనాన్ని ఆవిష్కరిస్తారు.
అమెరికా గాన కోకిల శారదా ఆకునూరు సి నా రె పాటలతో సంగీత విభావరిని సమర్పిస్తారు.డాక్టర్ కె వి రమణ, ఐఏఎస్ (రిటైర్డ్) మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సభాద్యక్షులుగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి అమెరికా, ప్రముఖ చలన చిత్ర దర్శకులు ఎ.కొందండ రామిరెడ్డి,డాక్టర్ లక్ష్మి ప్రసాద్ కలపటపు, ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శుభోదయం గ్రూప్ పాల్గొననున్నారని వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు తెలియ చేశారు.

వంశీ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు,ఆర్ ప్రసన్న లక్ష్మీ, శుభోదయం గ్రూప్, శైలజా సుంకరపల్లి, వంశీ సంస్థల మేనేజింగ్ ట్రస్ట్ కలసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ని, కార్యక్రమానికి ఆహ్వానించారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









