కోర్టులో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

- December 23, 2021 , by Maagulf
కోర్టులో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

పంజాబ్‌లో భారీ పేలుడు సంభవించింది. లూథియానాలోని ఓ కోర్టు కాంప్లెక్స్‌లో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోర్టు కాంప్లెక్స్‌లో రెండో అంతస్తులో ఉన్న బాత్‌రూమ్‌లో మధ్యాహ్నం 12.22 గంటల నిమిషాలకు ఈ ఘటన జరిగింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అది శక్తివంతమైన బాంబు కావచ్చని, ఆ పేలుడు ధాటికి బాత్‌రూమ్ గోడలు బద్ధలయ్యాయని ప్రత్యక్ష సాక్షలు పేర్కొన్నారు. పక్క గదుల్లో ఉండే కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాంబు పేలుడు ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com