కోర్టులో బాంబు పేలుడు.. ఇద్దరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
- December 23, 2021
పంజాబ్లో భారీ పేలుడు సంభవించింది. లూథియానాలోని ఓ కోర్టు కాంప్లెక్స్లో బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోర్టు కాంప్లెక్స్లో రెండో అంతస్తులో ఉన్న బాత్రూమ్లో మధ్యాహ్నం 12.22 గంటల నిమిషాలకు ఈ ఘటన జరిగింది. భారీ శబ్ధంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అది శక్తివంతమైన బాంబు కావచ్చని, ఆ పేలుడు ధాటికి బాత్రూమ్ గోడలు బద్ధలయ్యాయని ప్రత్యక్ష సాక్షలు పేర్కొన్నారు. పక్క గదుల్లో ఉండే కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాంబు పేలుడు ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!







