55 వేల మందికి బూస్టర్ డోస్

- December 24, 2021 , by Maagulf
55 వేల మందికి బూస్టర్ డోస్

ఒమన్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో 55 వేల మందికి పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్‌ థార్డ్ డోస్(బూస్టర్ షాట్)ను తీసుకున్నారు. ఈ మేరకు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ (MOH) వెల్లడించింది. డిసెంబర్ 21 నాటికి ఒమన్ సుల్తానేట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్‌ (సింగిల్ డోస్) వేసిన మొత్తం వ్యక్తుల సంఖ్య 3,123,613 మందికి చేరుకుందని, ఇది మొత్తం జనాభాలో 93 శాతానికి సమానమని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అలాగే రెండు డోసులు పొందిన వారి సంఖ్య 86 శాతం (2,898,331)కి చేరుకుంది. 55,085 మంది(2 శాతం) మంది మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. సుల్తానేట్ లో ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం డోసుల సంఖ్య 6,077, 029కు చేరుకుందని MOH వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com