నౌకలో అగ్నిప్రమాదం.. 32 మంది సజీవదహనం

- December 24, 2021 , by Maagulf
నౌకలో అగ్నిప్రమాదం.. 32 మంది సజీవదహనం

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ నౌకలో మంటలు చెలరేగి 32 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఝలోకఠి ప్రాంతంలోని సుగంధ నదిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నుంచి బరుంగా వెళ్తున్న ఓ మూడంతస్తుల ప్రయాణికుల నౌకలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకారు. మంటల్లో చిక్కుకుని 32 మంది సజీవదహనమైనట్లు అధికారులు తెలిపారు. మరికొందరు గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com